ప్లాన్-బికి ఓటేసిన రోహిత్, గంభీర్

చెపాక్ పిచ్‌ను పరిశీలించిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్లాన్‌ను మార్చినట్లు తెలుస్తోంది. 3-2 కాకుండా.. 2-3 కాంబినేషన్‌తో తుది జట్టుని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తుది జట్టులో అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్ రూపంలో ముగ్గురు స్పిన్నర్లు ఉంటారని, పేస్ బాధ్యతల్ని జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌ను పంచుకోనున్నారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. దాంతో ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన అక్షర్ పటేల్‌కి తుది జట్టులో చోటు లేదని తేలిపోయింది. ఈ నెల ప్రారంభంలో జరిగిన దులీప్ ట్రోఫీలో అక్షర్ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో మెరిశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here