2022 లో ది లెజండ్(the legend)అనే మూవీతో తెలుగు,తమిళ ప్రేక్షకులని పలకరించిన హీరో అరుళ్ శరవణన్(arul saravanan)ఇండియా వ్యాప్తంగా పేరు గడించిన శరవణ స్టోర్స్ అధినేత అయిన శరవణన్ ఆ సినిమాకి నిర్మాత గాను వ్యవహరించాడు.లెజండ్ మూవీకి సంబంధించి శరవణన్ లుక్ తో పాటు యాభై ఏళ్ళ పై బడిన వయసులో సినిమాలు అవసరమా అంటూ ఏజ్ మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి. కానీ వాటన్నిటిని  లెక్క చెయ్యకుండా ఎంతో దైర్యంగా సినిమాని కంప్లీట్ చేసి రిలీజ్ చేసాడు. కానీ సినిమా ఆశించినంతగా ఫలితాన్ని అందుకోలేదు.పైగా ట్రోల్ల్స్ కూడా ఒక రేంజ్ లోనే వచ్చాయి. అందుకనే ఇప్పుడు మరింత పట్టుదలతో ముస్తాబు అవుతున్నాడు.

శరవణన్ కొన్ని నెలల  క్రితం తన రెండో చిత్రాన్ని అనౌన్స్  చేసాడు. కానీ ఇన్ని రోజులు ఎలాంటి అప్డేట్ రాకపోయేసరికి మూవీని పక్కన పెట్టారేమో అనే అనుమానం అందరిలో వచ్చింది. కానీ ఆ అనుమానాల్ని పటాపంచలు చేస్తు  రీసెంట్ గా  షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఇప్పుడు ఈ మూవీ నుంచి కొన్ని క్రేజీ అప్ డేట్స్ బయటకి వచ్చాయి.శరవణన్ కి జోడిగా పాయల్ రాజ్ పుత్, ఆండ్రియా వంటి టాప్ హీరోయిన్స్ జత కడుతున్నారు. దీంతో ఒక్కసారిగా ఫిలిం సర్కిల్స్ లో ఈ న్యూస్ వైరల్ గా మారింది. మరి ఆ ఇద్దరి భామల పెర్ఫార్మ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అదే విధంగా హీరోలతో ఆ ఇద్దరు చేసే రొమాన్స్ సన్నివేశాలు కూడా ఒక రేంజ్ లో ఉండటంతో పాటుగా ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తాయి.మరి  శరవణన్ తో ఏ రేంజ్ పెర్ఫార్మ్ చేస్తారో అనే ఆసక్తి కూడా అందరిలో ఏర్పడింది. 

ప్రస్తుతం తూత్తుకుడిలో చిత్రీకరణ జరుపుకుంటుండగా సూరి హీరోగా వచ్చిన గరుడన్ తో హిట్ అందుకున్న ఆర్ఎస్ దొరై సెంథిల్ కుమార్(r s senthil kumar)దర్శకుడు కాగా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్  సంగీతాన్ని అందిస్తున్నాడు. శ్యామ్, సంతోష్ ప్రతాప్, కాలకేయ ప్రభాకర్ లాంటి వారు ముఖ్య పాత్రల్లో చేస్తున్నారు.పక్కా యాక్షన్ మూవీగా  తెరకెక్కుతుండగా శరవణన్ తన లుక్ మొత్తాన్ని మార్చేసి సరికొత్తగా రాబోతున్నాడు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here