రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ఉత్సవాలకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై మానేరు తీరంలో నిమజ్జనాన్ని పరిశీలించారు.కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ ఉన్నారు.
సిరిసిల్ల పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూం ద్వారా ఎప్పటికప్పుడు పోలీసులు పరిశీలిస్తున్నారు.ట్రాఫిక్, ఇతర ఇబ్బందులను
కంట్రోల్ రూం ద్వారా పరిశీలిస్తూ క్షేత్రస్థాయి సిబ్బందికి సూచనలు చేస్తున్నారు.