పేషెంట్‌ ట్యాబ్‌ పట్టుకుని అదుర్స్ సినిమాలోని జూ.ఎన్టీఆర్, బ్రహ్మానందం కామెడీ సీన్స్ చూస్తూ ఉండగా వైద్యులు ఆమె తలలోని కణితిని తొలగించారు. కాకినాడ జిల్లాలోని తొండంగి మండలం ఎ.కొత్తపల్లికి చెందిన ఎ. అనంతలక్ష్మి(55) అనే మహిళకు కుడి చేయి, కాలు లాగుతున్నాయని అనేక ప్రైవేట్ ఆసుపత్రులకు తిరిగింది. తీవ్రమైన తలనొప్పి, మూర్ఛ, కుడి వైపున తిమ్మిరి కారణాలతో సెప్టెంబర్ 11న కాకినాడలోని జీజీహెచ్ లో చేరింది. ఆమె మెదడుకు ఎడమవైపున 3.3 x 2.7 సెం.మీ కణితిని వైద్యులు గుర్తించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here