CM Revanth Reddy : తెలంగాణను ఒక ట్రిలియన్ ఎకానమీ చేయాలనేది మా లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర బడ్జెట్ రూ.3 లక్షల కోట్ల నుంచి 2028 నాటికి రూ.7 లక్షల కోట్లకు చేరుతుందని విశ్వసిస్తున్నానన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ పాలసీని సీఎం విడుదల చేశారు.