రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జన్మదినాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని స్థానిక పాత బస్టాండులో బుధవారం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయురారోగ్యాలతో ఆది శ్రీనివాసు ఉండాలని భగవంతున్ని వేడుకున్నట్లు కోరారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్మాడి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు షేక్ గౌస్, లింగం గౌడ్, సూడిద రాజేందర్, వంగ గిరిధర్ రెడ్డి, మర్రి శ్రీనివాస్ రెడ్డి, బండారి బాల్రెడ్డి, చెన్ని బాబు, నంది కిషన్ తదితరులు పాల్గొన్నారు.