లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ కావడం తెలుగునాట సంచలనంగా మారింది. ఈ విషయంపై సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు రకరకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా మంచు మనోజ్ కూడా తనదైన శైలిలో స్పందించాడు. తప్పు చేయకపోతే న్యాయం కోసం పోరాడండి, తప్పు చేస్తే నిజం ఒప్పుకోండి.. అంతేకాని పారిపోకండి అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశాడు.

“జానీ మాస్టర్ మీరు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. మీపై ఇలాంటి ఆరోపణలు బాధగా ఉంది. ఇందులో నిజానిజాలు, తప్పుఒప్పులు చట్టాలు తేలుస్తాయి. ఒక మహిళకి సంబంధించిన ఈ కేసులో పారిపోవడం కరెక్ట్ కాదు. తప్పు చేయకపోతే న్యాయం కోసం పోరాడండి, తప్పు చేస్తే నిజం ఒప్పుకోండి. ఈ కేసులో వేగంగా స్పందించి చర్యలు తీసుకున్న హైదరాబాద్ సిటీ పోలీస్ కి నా అభినందలు. అలాగే, ఇచ్చిన మాట ప్రకారం ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేయాలని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ను కోరుతున్నాను.” అని మనోజ్ ట్వీట్ చేశాడు.  అలాగే, మహిళల తరపున మనం పోరాడాలని, వారికి అండగా నిలబడాలని మనోజ్ పిలుపునిచ్చాడు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here