తొలి సెషన్‌లో ఆదుకున్న జోడి

మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, నెం.3లో వచ్చిన శుభమన్ గిల్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మ్యాచ్ ఆరంభమైన తొలి గంటలోనే బంగ్లాదేశ్ పేసర్ హసన్ మహమూద్‌కి వికెట్లు సమర్పించుకున్నారు. దాంతో భారత్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతని రిషబ్ పంత్, యశస్వి జైశ్వాల్ తీసుకున్నారు.

మ్యాచ్‌లో 118 బంతులు ఎదుర్కొన్న యశస్వి జైశ్వాల్ 9 ఫోర్ల సాయంతో 56 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ కూడా 52 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 39 పరుగులు చేసి ఔటయ్యాడు. భారత్ జట్టు 34/3తో నిలిచిన దశలో పట్టుదలతో బ్యాటింగ్ చేసిన ఈ యంగ్ జోడి నాలుగో వికెట్‌కి 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అయితే రెండో సెషన్‌లో ఇద్దరూ ఒకే తరహాలో వికెట్ చేజార్చుకుని పెవిలియన్‌ బాట పట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here