తన రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు సాక్ష్యాత్తు వేంకటేశ్వర స్వామి వారిని వాడుకోవడం అనేది తీవ్ర అభ్యంతరకరం అని వైసీపీ విమర్శించింది. కొన్ని కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవం వేంకటేశ్వర స్వామి.. కానీ తానే గొప్ప భక్తుడిని అన్నట్టు చంద్రబాబు ప్రచారం చేసుకుంటూ ఉంటారని ఫైర్ అయ్యింది. వైసీపీ మీద, జగన్ మీద దాడి చేయడం కోసమే స్వామి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వును ఉపయోగించారని చెప్పడం అనైతికం, అపచారం, దుర్మార్గం అని మండిపడుతోంది. రాజకీయ దురుద్దేశంతో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఆ దేవుడే శిక్షిస్తాడని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here