2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. తొలి మంత్రివర్గంలోనే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి చోటు దక్కింది. విద్యుత్, అటవీ శాఖ మంత్రిగా ఆయన రెండున్నరేళ్లు పని చేశారు. ఆ తర్వాత మంత్రి వర్గంలో మార్పులు జరిగాయి. అప్పుడు బాలినేనికి అవకాశం దక్కలేదు. అటు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వంటి వాళ్లను జగన్ మంత్రి వర్గంలో కొనసాగించారు. దీంతో బాలినేని అసంతృప్తి వ్యక్తం చేశారు. వారికి మళ్లీ అవకాశం ఇచ్చి.. తనకు ఇవ్వకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు.
Home Andhra Pradesh Balineni : ‘జనసేనలో చేరుతాను.. అటువైపు నుంచి రాంగ్ గా మాట్లాడితే అన్ని బయటపెడతా’