తెలంగాణలోని తొలిసారిగా పైలెట్ ప్రాజెక్టు కింద కరీంనగర్ ఐటీఐ కాలేజీలో ఏర్పాటు చేసిన ఏఆర్, వీఆర్ ల్యాబ్ ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఐటీఐ విద్యార్థి ఏ ట్రేడ్లోనైతే చేరతాడో… ఆ కోర్సును AR VR ల్యాబ్ ద్వారా లైవ్ లో నేర్చుకోవచ్చని తెలిపారు. ఎలక్ట్రిషియన్, వైర్ మేన్ ట్రేడ్, వెల్డర్, ఫిట్డర్, మెకానికల్ ట్రేడ్, టర్నర్ ట్రేడ్ ఇలా పలు రకాల కోర్సులను AR VR ల్యాబ్ లో ప్రాక్టీస్ చేయవచ్చని తెలిపారు.