రాజంపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో.. కూటమి నాయకుల మధ్య ఫైటింగ్ జరిగింది. అన్న క్యాంటీన్ రిబ్బన్ కటింగ్ కోసం కూటమి నాయకులు కొట్టుకున్నారు. రాజంపేట టీడీపీ ఇంఛార్జ్ తానంటే తానని అని సుగవాసి బాలసుబ్రమణ్యం, చమర్తి జగన్మోహన్ రాజు ఎవరికి వారు ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో.. అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ కార్యక్రమంలో గొడవ పడ్డారు. ఒకరు కత్తెర తీసుకొని రిబ్బన్ కట్ చేయబోగా.. మరొకరు దాన్ని లాక్కున్నారు. ఈ సమయంలో వివాదం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here