మెరుగైన ఆధిక్యంలోకి భారత్
రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజైన శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో మూడు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది.
క్రీజులో శుభమన్ గిల్ (33 బ్యాటింగ్: 64 బంతుల్లో 4×4), రిషబ్ పంత్ (12 బ్యాటింగ్: 13 బంతుల్లో 1×4, 1×6) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ జట్టు 376 పరుగులకి ఆలౌట్ అవగా.. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆడిన బంగ్లాదేశ్ టీమ్ 149 పరుగులకే ఆలౌటైంది. దాంతో టీమిండియాకి 227 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓవరాల్గా శుక్రవారం ఆట ముగిసే సమయానికి 81/3తో నిలిచిన టీమిండియా 308 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.