IND vs BAN 1st Test 2024: భారత్, బంగ్లాదేశ్ మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజైన శుక్రవారం ఆట ప్రారంభమైంది. గురువారం ఆరంభమైన ఈ టెస్టులో తొలిరోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో భారత్ జట్టు 6 వికెట్లు నష్టపోయి 339 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం క్రీజులో రవిచంద్రన్ అశ్విన్ (102 బ్యాటింగ్: 112 బంతుల్లో 10×4, 2×6), రవీంద్ర జడేజా (86 బ్యాటింగ్: 117 బంతుల్లో 10×4, 2×6) ఉన్నారు. ఈ ఇద్దరూ ఈరోజు తొలి సెషన్ మొత్తం బ్యాటింగ్ చేయగలిగితే.. భారత్ జట్టు భారీ స్కోరుని అందుకునే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here