జానీ మాస్టర్(jani master)ని కస్టడీ కి కోరుతు నార్సింగ్ పోలీసులు సంబంధిత ఉప్పరపల్లి కోర్టులో వేసిన పిటిషన్ ని కోర్టు అనుమతించింది.దీంతో పోలీసులు జానీ మాస్టర్ ని చర్లపల్లి జైలుకి తరలించడం జరిగింది. ఆ సమయంలో జానీ మాస్టర్ పోలీసుల దగ్గర నన్ను ఈ కేసులో కావాలని ఇరికించారని, ఆ విధంగా చేసిన వాళ్లని వదలనని చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

జానీ మాస్టర్ వేధింపుల కేసులో ఫిలింఛాంబర్ సభ్యురాలైన ప్రముఖ సినీ నటి ఝాన్సీ మాట్లాడుతూ ఒక బిగ్ హీరో తన   మేనేజర్ ని పంపించి బాధిత అమ్మాయికి సపోర్టుగా నిలిచారని చెప్పింది. దాంతో ఆ బిగ్ హీరో అల్లు అర్జున్(allu arjun)అనే న్యూస్ సోషల్ మీడియాలో బాగానే స్ప్రెడ్ అవుతుంది.పైగా బన్నీ తన ప్రతి సినిమాతో పాటుగా గీతా ఆర్ట్స్ నుంచి వచ్చే ప్రతి సినిమాలోను  ఆ అమ్మాయికి ఆఫర్స్ ఇస్తానని చెప్పినట్టుగా కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ గురించి తాజాగా ఒక చర్చ జరుగుతుంది. అల్లు అర్జున్ గతంలో తనతో పాటు పుష్ప లో చేసిన కేశవ ఒక అమ్మాయిని లైంగిక వేధింపులకి గురి చెయ్యడం వల్ల ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. 

దాంతో కేశవ్ ని పోలీసులు అరెస్ట్ కూడా చేసారు.అప్పుడు అల్లు అర్జున్ ఆ అమ్మాయి గురించి ఏం మాట్లాడలేదు. సీక్రెట్ గా కేశవ్ కి బెయిల్ ఇప్పించి పుష్ప 2  లో చేయించుకుంటున్నాడు.మరి ఇప్పుడు జానీ మాస్టర్  విషయంలో మాత్రం బాధిత అమ్మాయి గురించి ఎందుకు ఇంట్రెస్ట్ తీసుకున్నాడనే చర్చ జరుగుతుంది. జానీ మాస్టర్ జనసేనలో యాక్టీవ్ గా ఉన్ననందుకే అనే ప్రచారం కూడా ఉంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here