మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(ntr)దేవర(devara)గా ఈ నెల 27 న వరల్డ్ వైడ్ గా అడుగుపెట్టబోతున్నాడు. దీంతో ఎన్టీఆర్ కంటిన్యూగా ప్రమోషన్స్ లో పాల్గొనడంతో పాటుగా పలు ఇంటర్వ్యూ లు కూడా ఇస్తూ దేవర కి సంబంధించిన అనేక విషయాలని అభిమానులతో పంచుకుంటూ ఉన్నాడు. ఇక అభిమానులందరు ఈ నెల 22 న హైదరాబాద్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడు ఈ ఈవెంట్ కి ప్రముఖ దర్శకులు రాజమౌళి(rajamouli)త్రివిక్రమ్ శ్రీనివాస్(trivikram srinivas)ప్రశాంత్ నీల్(prashanth neel)లు హాజరు కాబోతున్నారని  తెలుస్తుంది.చిత్ర బృందం నుంచి ఇంతవరకు ఎలాంటి ప్రకటన రాకపోయినా కూడా ఆ ముగ్గురు రావడం మాత్రం పక్కా అని తెలుస్తుంది.ఈ మేరకు మేకర్స్ నుంచి అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు.ఇక ఆ ముగ్గురు వస్తున్నారన్న వార్తలు  సోషల్ మీడియాలో  వస్తుండంతో ఎన్టీఆర్ అభిమానుల్లో మాత్రం ఆ ముగ్గురు ఎన్టీఆర్ గురించి ఏం మాట్లాడతారనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.పైగా ఎన్టీఆర్ దేవర తర్వాత ప్రశాంత్ నీల్ మూవీనే చేస్తున్నాడు.కొన్ని రోజుల క్రితం అధికారకంగా కూడా  ప్రారంభమయ్యింది.దీంతో ఆ మూవీకి సంబంధించిన అప్ డేట్స్ ఏమైనా ప్రశాంత్ చెప్తాడేమో అని కూడా ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఇక ఈవెంట్ హైదరాబాద్ నోవాటెల్ లో జరగనుంది.భారీగా తరలి వచ్చే అభిమానులని తట్టుకోలేక పరిమిత సంఖ్యలో ఇండోర్ లో నిర్వహించబోతున్నారు.జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ(koratala siva)కాంబోలో దేవర వస్తుండగా అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్(jahnvi kapoor)తొలిసారి తెలుగు సిల్వర్ స్క్రీన్ మీద అడుగుపెట్టనుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here