లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి కార్యక్రమంలో కింగ్ నాగార్జున కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది ఏఎన్నార్ అవార్డును మెగాస్టార్ చిరంజీవికి ఇవ్వబోతున్నట్లు అనౌన్స్ చేశారు. నాన్న గారి పేరు మీద రెండేళ్లకు ఒకసారి అవార్డు ఇస్తున్నామని, ఈసారి చిరంజీవి గారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నామని నాగార్జున తెలిపారు. ఈ విషయం చిరంజీవి గారికి చెప్తే ఎంతో సంతోషించారని, ఏఎన్నార్ గారి శతజయంతి ఏడాది నాకు ఈ అవార్డు ప్రకటించడం చాలా హ్యాపీగా ఉందని, ఇంతకంటే పెద్ద అవార్డు నాకు లేదని అన్నారు. అంతేకాదు, అక్టోబర్ 28 న అమితాబ్ బచ్చన్ గారి చేతుల మీదుగా అవార్డు ప్రధానం చేయనున్నట్లు నాగార్జున ప్రకటించారు. (ANR Lives On)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here