ఉత్తర తెలంగాణలో తన విద్యాసంస్థలు, తనకున్న పరిచయాలతో గ్రాడ్యుయేట్ల వివరాలు ఎన్రోల్మెంట్ కోసం సేకరిస్తున్నారు. వెలిచాల రాజేందర్ రావు ఎంపీ ఎన్నికల అనంతరం నియోజకవర్గంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తు సిరిసిల్ల చేనేతకు ప్రభుత్వ బ్రాండింగ్, ట్రేడింగ్లో శిక్షణ, గ్రాడ్యేయేట్లకు మేనిఫెస్టోలతో ముందుకెళ్తున్నారు. ఎమ్మెల్సీగా పార్టీ అవకాశమిస్తే పోటీ చేస్తానని తెలిపారు. పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యమని, ఎవరికి టికెట్ ఇచ్చినా బలపరుస్తానని స్పష్టం చేస్తున్నారు.