శ్రీవారి నైవేధ్యాల కోసం నిత్యం 60కేజీల స్వచ్ఛమైన నెయ్యిని దాతల సహకారంతో గుజరాత్, రాష్ట్రాల్లోని గోశాల నుంచి లక్ష రుపాయల వ్యయంతో కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. రోజుకు 60కిలోలను లక్ష రుపాయల చొప్పున నెలకు రూ.30లక్షలు ఖర్చు చేస్తున్నట్టు సుబ్బారెడ్డి స్వయంగా వెల్లడించారు. ఆ లెక్కల్లో కిలో ధర రూ.1667 పలుకుంది. స్వామి వారి నైవేధ్యానికి వినియోగించే నెయ్యి ధర రూ.1667 ఉన్నపుడు, లడ్డూ ప్రసాదాలకు వాడే నెయ్యి కిలో రూ.470కు ఎలా వస్తుందనేది మరో ప్రశ్న. స్వామి వారి నైవైధ్యాలలో వాడే నెయ్యి, ప్రసాదాల్లో వాడే నెయ్యి ఒక్కటి కాదని వైవీ సుబ్బారెడ్డి స్వయంగా అంగీకరించినట్టైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here