లైంగిక వేధింపుల కేసులో స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(jani master)కి హైదరాబాద్ లోని ఉప్పరపల్లి కోర్టు వచ్చే నెల 3 వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.దీంతో పోలీసులు జానీ మాస్టర్ ని చర్లపల్లి జైలుకి తరలించారు.ఇక జానీ మాస్టర్ మీద వస్తున్న ఆరోపణల మీద మొదటి నుంచి కూడా ఆయన భార్య అయేషా ఖండిస్తూ వస్తుండంతో పాటుగా జానీ మాస్టర్ నిర్దోషిగా తిరిగొస్తాడని చెప్తుంది.

ఈ నేపథ్యంలోనే  తాజాగా పవన్ కళ్యాణ్(pawan kalyan)స్థాపించిన జనసేన పార్టీ గురించి పలు కీలక వ్యాఖ్యలు చేసింది.మేము ప్రాణం ఉన్నతవరకు జనసేన పార్టీలోనే ఉంటాం. కొంత మంది జనసేన నాయకులు కేసు విషయంలో మాట్లాడారు.అలాగే పార్టీ కూడా జానీ మాస్టర్ ని  పార్టీకి సంబంధించిన  కార్యక్రమాలకి దూరంగా ఉండమని చెప్పిందే  గాని సస్పెండ్ చెయ్యలేదు. పవన్ కళ్యాణ్ కోసం రెండు నెలలు పాటు షూటింగ్ లని కూడా ఆపుకొని జానీ మాస్టర్ తిరిగాడని చెప్పుకొచ్చింది.జానీ మాస్టర్ కూడా చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ అంటే తనకి ప్రాణమని చెప్పాడు. పిఠాపురం లో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ప్రచారం కూడా చేసాడు.

 


 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here