నగల కోసమే హత్య

కుటుంబ సభ్యులు చేగుంట పోలీస్ స్టేషన్ లో లలిత కూతురు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్న పోలీసులకు లలిత మాసాయిపేటలో ఒక దంపతుల వెంట వెళ్లినట్టు గుర్తించారు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా విచారణ చేపట్టి వారు కనకయ్య, ప్రమీలగా గుర్తించి, కస్టడీలోకి తీసుకున్నారు. తదుపరి విచారణలో లలితను నగల కోసమే హత్య చేసినట్లు ఆ దంపతులు ఒప్పుకున్నారు. యాదగిరిగుట్టకు బండిపై వెళ్తుండగా, మార్గ మధ్యలో సిద్దిపేట జిల్లాలోని పీర్లతండా వద్ద అటవీ ప్రాంతంలో తనను గొంతు నులిమి చంపారు. ఆ తరువాత తన దగ్గర ఉన్న బంగారు, వెండి ఆభరణాలు, సెల్ ఫోన్ తీసుకొని తమ ఇంటికి తిరిగి వెళ్లామన్నారు. దొంగిలించిన ఆభరణాలు ఒక బంగారు దుకాణంలో కుదువ పెట్టగా, ఆ వ్యాపారి దంపతులకు రూ 33,000 ఇచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here