టీటీడీ బోర్డు పర్యవేక్షణలో

గత కొన్ని దశాబ్దాలుగా నెయ్యి కొనుగోళ్లలో టీటీడీ అనుసరిస్తున్న విధానాలు చాలా పటిష్టంగా ఉంటాయని జగన్ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల వెంకటేశ్వర ఆలయాన్ని నిర్వహించే స్వతంత్ర ట్రస్ట్ అని తెలిపారు. ధర్మకర్తల మండలిలో విభిన్న నేపథ్యాల నుంచి, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సిఫార్సు చేసిన బలమైన భక్తులు ఉంటారన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఇదే ఆచారం ఉందన్నారు. ప్రస్తుత టీటీడీ బోర్డులో ఉన్న కొందరు బీజేపీకి కూడా అనుబంధంగా ఉన్నారన్నారు. టీటీడీ పరిపాలనను పర్యవేక్షించే అధికారం ధర్మకర్తల మండలికి ఉందని, ఆలయ వ్యవహారాల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వానికి తక్కువ పాత్ర ఉందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here