ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పొన్నం… మూసీ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. పర్యాటక , పారిశ్రామిక , పర్యావరణ ,నీటి ఇబ్బందులు లేకుండా అందమైన టూరిజం ప్రాంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. అయితే అక్రమణల తొలగింపుతో ఇబ్బందే పడే పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చే ఆలోచన ఉందన్నారు. వీలైనంత త్వరగా అందజేసే దిశగా ప్రయత్నాలు చేస్తామని… ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపును కూడా పరిశీలిస్తామని పేర్కొన్నారు.