ప్రధానికి జగన్ రాసిన లేఖలో మొత్తం అబద్ధాలే ఉన్నాయని సీఎం చంద్రబాబు విమర్శించారు. తిరుమలలో విధ్వంసం చేసి, తన పాత్ర ఏమీ లేదని ప్రధానికి లేఖ రాశారన్నారు. అసలు తిరుమలలో పూర్తి స్థాయిలో కల్తీని టెస్ట్ చేసే వ్యవస్థే లేదన్నారు. ఏ ప్రార్థనా మందిరంలో అయినా, ఆ మతం వాళ్లే బోర్డులో ఉండాలని, వాళ్లే మ్యానేజ్ చేయాలన్నారు. ఇతర మతాల వారు ఉండటానికి వీల్లేదన్నారు. దేవాలయాలు అయినా, చర్చిలు అయినా, మసీదులు అయినా, ఆ మతం వాళ్లే ఉండాలని, అవసరం అయితే ప్రత్యేకమైన చట్టం కూడా తెస్తామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here