ఉమ్మడి కడప జిల్లాలో వరుస చోరీలు ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. పోలీసులకు సవాల్ విసురుతూ దొంగలు రెచ్చిపోతున్నారు. తాళాలు వేసిన ఇండ్లు, ఏటీఎం కేంద్రాలు, హైవేల మీద తిరిగే లారీలను లక్ష్యంగా చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శనివారం రాత్రి కడప, ఒంటిమిట్టలో ఆదివారం తెల్లవారుజామున పులివెందులలో భారీ చోరీలు జరిగాయి. పులివెందులలోని ఓ ఇంటిలో సుమారు రూ.60 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులు, రూ.1 లక్ష నగదు చోరీ చేశారు. ఇక ఒంటిమిట్ట ఏటీఎంలో రూ.36 లక్షలు, కడప ద్వారకానగర్‌ లోని ఏటీఎంలో రూ.6 లక్షలు ఎత్తుకెళ్లారు దొంగలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here