మహా భారతం 18 పర్వములతో, లక్ష శ్లోకాలతో ప్రపంచంలోనే అతి పెద్ద పద్య కావ్యాలలో ఒకటిగా పేరు గాంచింది. మన ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మలు మహాభారతాన్ని చదువుకుంటూ ఉంటారు. జీవితంలో ఒక్కసారైనా ఇది చదవడం చాలా ముఖ్యం. ఇది కేవలం గ్రంథం మాత్రమే కాదు. ఒక మనిషి ఎలా జీవించాలి అనేది తెలియజేస్తుంది. జ్ఞానాన్ని బోధిస్తుంది. సత్య మార్గాన్వేషణ ఎలా చేయాలో వివరిస్తుంది. ఏది మంచి ఏది చెడు అనే విషయాన్ని అందులోని వ్యత్యాసాన్ని చెప్తుంది. మహా భారతం చదవడం వల్ల మనకు తెలియని ఎన్నో గొప్ప విషయాలు తెలుస్తాయి.