అధికారులపై నోరు పారేసుకోవటం ప్రజా ప్రతినిధిలకు పరిపాటిగా మారింది. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తున్నారు. చివరికి నిరసనలు వ్యక్తం అవుతున్న తరుణంలో నాలుక కరచుకొని క్షమాపణలు చెబుతున్నారు. తాజాగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ విషయంలోనూ ఇదే జరిగింది. రంగరాయ మెడికల్ కాలేజ్ మైదానంలో ఎమ్మెల్యే అనుచరులు అనుమతి లేకుండా వాలీబాల్ ఆడేందుకు నెట్ కట్టారు. అయితే స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావు వ్యతిరేకించి, ఉన్నతాధికారుల నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఆడుకోవాలని చెప్పారు. దీనిపై ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగి బూతులతో విరుచుకుపడ్డారు. ఎందుకు పర్మిషన్ ఇవ్వరని తిట్ల పురాణం అందుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో ఇవాళ ఎమ్మెల్యే తన ఇంటి వద్ద ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here