వీరు కాకుండా ఇంకా మందుల సామేలు (తుంగతుర్తి), వేముల వీరేశం (నకిరేకల్), బత్తుల లక్ష్మారెడ్డి (మిర్యాలగూడ), కుందూరు జైవీర్ రెడ్డి (నాగార్జున సాగర్), బాలూ నాయక్ (దేవరకొండ), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (మునుగోడు), కుంభం అనిల్ కుమార్ రెడ్డి (భువనగిరి) ఉన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో సీఎం సహా 18 మందికి అవకాశం ఉండగా, మరో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటై తొమ్మిది నెలలు గడిచిపోయాక ఆ ఆరు ఖాళీలను భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతోందని, దసరా లోగా మంత్రి వర్గ విస్తరణ ఉంటుందన్న సమాచారంతో జిల్లాలోని అయిదుగురు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.