Tirumala Laddu Row SIT : తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ వివాదంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది. సిట్లో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజుతోపాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు ఉన్నారు.
Home Andhra Pradesh తిరుమల లడ్డూ వ్యవహారంపై సిట్ ఏర్పాటు, చీఫ్ గా ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నియామకం-tirumala laddu...