సెప్టెంబర్ 22న హైదరాబాద్ లోని నోవొటెల్‌ లో జరగాల్సిన ‘దేవర’ (Devara) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చివరి నిమిషంలో రద్దయిన సంగతి తెలిసిందే. నోవొటెల్‌ కెపాసిటీ ఐదు వేలు కాగా, ఏకంగా 35 వేల మంది అభిమానులు అక్కడికి వచ్చారని అంచనా. దీంతో వారిని కంట్రోల్ చేయడం పోలీసులు, హోటల్ సెక్యూరిటీ సిబ్బంది తరం కాలేదు. ఈ క్రమంలో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడి.. చివరికి భద్రతా కారణాల దృష్ట్యా ఈవెంట్ నే క్యాన్సిల్ చేశారు. ఈ గందరగోళంలో అభిమానుల ఆవేశం కట్టలు తెంచుకోవడంతో.. నోవొటెల్ కొంతమేర డ్యామేజ్ అయింది. ముఖ్యంగా కుర్చీలు, డోర్లు బాగా డ్యామేజ్ అయ్యాయి. ఈ మొత్తం డ్యామేజ్ విలువ ఏకంగా రూ.33 లక్షలు అని తెలుస్తోంది. ఇప్పుడు ఆ మొత్తాన్ని కట్టే బాధ్యత దేవర మేకర్స్ పై పడింది.

దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ షాక్ తో ఇక మీదట స్టార్ హీరోల సినిమాల ఈవెంట్ల విషయంలో మేకర్స్ జాగ్రత్తగా ఉండే అవకాశముంది. అవుట్ డోర్ లో ఈవెంట్ ప్లాన్ చేయడం లేదా ఇండోర్ లో అయితే అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకోవడం చేయాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here