ఈ ప్రమాదంలో సీసీ కెమెరాలు, జిరాక్స్ మెషీన్లు, వాటితో పాటు రూ.3 లక్షల నగదు, ఐదు తులాల వరకు బంగారు ఆభరణాలు అన్నీ అగ్నికి ఆహుతి అయ్యాయి. ఇల్లు కూడా దెబ్బ తిని గోడలన్నీ నెర్రలు బారాయి. పిడుగు పాటు వల్ల దాదాపు రూ.50 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. అనూహ్య ఘటనతో తీవ్రంగా నష్టపోయామని.. తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. ఇల్లు మొత్తం కాలిపోవడంతో.. బాధితురాలు రోధించిన తీరు గ్రామస్థులను కంటతడి పెట్టించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here