Mla Mahipal Reddy : పటాన్ చెరులో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రీడోత్సవాలకు పోలీసులు భద్రత కల్పించలేదని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 26 మండలాల నుంచి 1000 మంది బాలబాలికలు క్రీడోత్సవాలకు హాజరవుతున్నా భద్రతకు కనీసం ఒక్క కానిస్టేబుల్ ను కూడా నియమించలేదని ఎమ్మెల్యే మండిపడ్డాడు.