పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి ఓర్వలేక మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్వి రెడ్డి మండిపడ్డారు. తమకి నిద్రలేని రాత్రులు కాదని, అవినీతిపై విచారణ చేస్తే ఎర్రబెల్లికే నిద్రలేని రాత్రులు వస్తాయని ఎద్దేవా చేశారు. హద్దులు మీరి ఎర్రబెల్లి ప్రవర్తించ వద్దని ఎమ్మెల్యే యశస్వి హెచ్చరించారు.