రుణమాఫీ కాకపోతే మాకేంటీ..
ఇప్పటికీ వేలాది మంది రైతులకు సంపూర్ణ రుణమాఫీ కాలేదు. తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించాలని బ్యాంకులు, సహకార సంఘాలు రైతులపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో రైతులు బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా.. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో రుణమాఫీ కాలేదని రైతన్నలు రోడ్డెక్కి ఆందోళన చేశారు. రుణమాఫీ కాలేదని, కొత్త రుణాల మంజూరులో బ్యాంకర్లు అలసత్వం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్బీఐ బ్యాంకు ముందు రోడ్డుపై బైఠాయించారు.