తిరుమలలో కొనుగోలు చేసిన శ్రీవారి లడ్డులో పొగాకు పొట్లం రావడం కలకలం రేపుతోంది. ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెంకు చెందిన దొంతు పద్మ అనే భక్తురాలు ఈ నెల 19న బంధువులతో తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్ళింది. బంధువులకు ప్రసాదం పంచేందుకు లడ్డు తీయగా ప్రసాదంలో కనిపించిన పొగాకు పొట్లం కనిపించింది. శ్రీవారి లడ్డు ప్రసాదంలో పొగాకు కనిపించడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో పొగ కనిపించడంతో భక్తురాలు ఆగ్రహం చేస్తున్నారు.