20 రోజులుగా రాజమండ్రి అభయారణ్యంలో

రాజమండ్రి పరిసరాల్లో అడవుల నుంచి జనావాసాల్లోకి చేరిన చిరుతపులి 20 రోజులుగా ఇక్కడ తిష్ఠవేసింది. దివాన్‌ చెరువు సమీపంలో సుమారు 950 ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. ఈ ప్రాంతంలో తిష్టవేసిన చిరుత రాత్రి సమయాల్లో దివాన్‌ చెరువు, లాలా చెరువు ప్రాంతాల్లో ఇటీవల సంచరించింది. చిరుత సంచారంతో హౌసింగ్‌బోర్డు కాలనీ, ఆటోనగర్‌, స్వరూపనగర్‌, శ్రీరూపా నగర్‌, శ్రీరామ్‌ నగర్‌ ప్రాంత ప్రజలు భయాందోళన వ్యక్తం చేశారు. దీంతో సుమారు 100 వరకు ట్రాప్‌కెమెరాలు, 15 వరకు ట్రాప్‌ కేజ్‌ లను ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేశారు. అయితే చిరుత ట్రాప్‌ కెమెరాలకు మాత్రమే చిక్కింది. గత నాలుగు రోజులుగా చిరుత జాడ కనిపించలేదు. తాజాగా మంగళవారం రాత్రి కడియపులంక పరిసరాల్లో చిరుత జాడ కనిపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here