స్వామిపై తమకు భక్తి లేకపోవచ్చని కానీ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడుతామని సీపీఐ సీనియర్ నాయకులు నారాయణ అన్నారు. టీటీడీ ఈవో బాధ్యతలు నిర్వర్తించిన ధర్మారెడ్డి చరిత్ర నీచమైనదని విమర్శించారు. ఆయన రాజకీయ నాయకుడిగా వ్యవహరించారని ఆరోపించారు. అందుకే ఇలా నాణ్యత లేని నెయ్యిని తక్కువ ధరకు కొనుగోలు చేశారని మండిపడ్డారు. రివర్స్ టెండర్ వల్ల ఇదే సమస్య అని నారాయణ విమర్శించారు.