కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం ఏలేశ్వరం నగర పంచాయితీలో ఓ వడ్డీ వ్యాపారి నిర్వాకం చోటు చేసుకుంది. అప్పు తీసుకుని వడ్డీ చెల్లించడం లేదని ఇంటికి తాళాలు వేశాడు వడ్డీ వ్యాపారి. వడ్డీ చెల్లించేంత వరకు భర్త, భార్య పిల్లలు గృహ నిర్భందం ఉండాలని ఆదేశించాడు. అలా కాదని బయటకు వస్తే పెట్రోల్ పోసి తగులబెడతా అని వడ్డీ వ్యాపారి బెదిరించినట్లు ఆ కుటుంబం ఆరోపించింది. పొట్టా సత్యనారాయణ అనే వడ్డీ వ్యాపారి వద్ద ఇంటిపై అప్పు తీసుకున్నట్లు బాధితుడు శ్రీనివాసరావు వెల్లడించారు. తనకు న్యాయం చేయాలని గృహ నిర్బంధం నుంచే బాధితుడు వేడుకుంటున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here