వాటర్ ట్యాంక్ ఏర్పాటు…!
ప్రభాకర్ ప్రాణాలు కోల్పోవడంతో ఆయన స్మారకార్థం పేరెంట్స్ కోటి రూపాయల విలువ చేసే భూమిని గ్రామ పంచాయతీకి అప్పగించారు. ఎకరం ఆరు గుంటల భూమిలో ప్రాథమిక పాఠశాల, హనుమాన్ టెంపుల్, వాటర్ ట్యాంక్, కమ్యూనిటీ హాల్ నిర్మించారు. కోటి రూపాయల విలువ చేసే భూమిని గ్రామ పంచాయతీకి ఇచ్చిన ప్రభాకర్ స్మారక స్తూపం పంచాయతీ పాలక వర్గం ఏర్పాటు చేసింది. కోటి రూపాయల విలువ చేసే భూమిని విరాళంగా ఇవ్వడంతో పాటు బడి గుడి ఏర్పాటుకు దోహదపడ్డ పేరేంట్స్ ను గ్రామస్థులు అభినందిస్తూ సన్మానించారు.