నేలకొరిగిన వరి పంట..
గాలి వాన అన్నదాతలను నిండా ముంచ్చింది. వానతో పాటు గాలికి వరి మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. వరి గింజ కట్టే దశలో ఉండడంతో గాలికి నెలకొనడంతో అన్నదాతలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. తిమ్మాపూర్, చిగురుమామిడి మండలాల్లో పంటలు బాగా దెబ్బ తిన్నాయి. ఈనెల మొదటి వారంలో కురిసిన వర్షంతో పంటలు నీటమునిగి కొంత దెబ్బతినగా ప్రస్తుతం కురిసిన వర్షంతో నేలకొరకడంతో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.