తనకు అప్పగించిన బాధ్యతలతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిబద్ధతతో పనిచేస్తున్నారని జనసేన పార్టీ నేత నాగ బాబు అన్నారు. చంద్రబాబు నేతృత్వంలో పవన్ కళ్యాణ్ సమర్థవంతంగా తన విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. అందుకే కేంద్రం కూడా పంచాయతీరాజ్ కు సమృద్ధిగా నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. జగన్ రెడ్డి మాత్రం వచ్చిన నిధులను మింగేసారని ఆరోపించారు.