భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలకు విడుదల సమయంలో టికెట్ల ధరలు పెంచుకునేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేవర మూవీ టీమ్ ఏపీ ప్రభుత్వాన్ని టికెట్ల ధరలు పెంచాలని కోరింది. ఇందుకు ఏపీ సర్కార్ అనుమ‌తినిస్తూ జీవో జారీ చేసింది. మల్టీప్లెక్స్‌ థియేటర్లలో టికెట్‍పై అదనంగా రూ.135 పెంచుకునేందుకు, సింగిల్ స్క్రీన్‍లలో బాల్కనీ టికెట్‍పై రూ.110, క్లాస్‍ టికెట్‍పై రూ.60 అదనంగా వసూలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. రెండు వారాల వరకు టికెట్లపై అదనపు ధరలు అమల్లో ఉంటాయని పేర్కొంది. అయితే ఈ జీవోను స‌వాల్ చేస్తూ హైకోర్టులో పిటిష‌న్ దాఖలు కాగా టికెట్ ధరల పెంపును 10 రోజులకు పరిమితం చేస్తూ తీర్పు ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here