సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్లోని పెద్ద చెరువులో ఓ వ్యక్తి ఏకంగా మూడు అంతస్తుల భవనం నిర్మించాడు. ప్రస్తుతం చెరువు నీరు ఆ భవనం కింది వరకు వచ్చాయి. దీంతో బిల్డింగ్ FTL పరిధిలో అక్రమంగా నిర్మించారని గుర్తించిన హైడ్రా అధికారులు.. బాంబులు పెట్టి పేల్చేశారు. ఈ క్రమంలో శిథిలాలు ఎగిరిపడి ఇద్దరికి గాయాలు అయ్యాయి. వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here