ఫొటోలు తీసి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసిన ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెండ్ వేటు పడింది. ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ.. నాగర్కర్నూల్ ఎస్పీ ఆదేశాలు ఇచ్చారు. నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న రామ్ చందర్, చిన్నయ్య అనే కానిస్టేబుళ్లు ఫొటోలు తీసి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసినట్లు నిర్ధారణ కావడంతో.. వారిని ఎస్పీ గైక్వాయిడ్ వైభవ్ రఘునాథ్ సస్పెండ్ చేశారు.