ఉప్పలపాటి రత్న మాణిక్యాంబ మెమోరియల్ సంస్థ.. తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తోంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఏడాదికి రూ.25 వేలు, అవసరం ఉంటే ఇంకా ఎక్కువ స్కాలర్షిప్ ఇస్తామని సంస్థ ప్రకటించింది. అర్హులైన విద్యార్థులు అప్లై చేసుకోవాలని సంస్థ ప్రతినిధులు సూచించారు.