Ind vs Ban 2nd Test: టీమిండియాతో కాన్పూర్ లో జరగబోయే రెండో టెస్టుకు ముందు బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబల్ హసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య ఉన్న తేడా ఏంటో చెప్పాడు. స్వదేశంలో ఇండియా అజేయమైన జట్టు అని, పాకిస్థాన్ అంతగా అనుభవం లేని టీమ్ అని అన్నాడు. పాకిస్థాన్ ను వాళ్ల దేశంలోనే 2-0తో ఓడించి ఇండియాకు వచ్చిన బంగ్లాదేశ్ తొలి టెస్టులో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే.