జడేజాతో బౌలింగ్ చేయించని రోహిత్

జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో అతి జాగ్రత్తగా ఆడుతున్న బంగ్లాదేశ్ బ్యాటర్లు.. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో మాత్రం అటాక్ చేస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 4 ఓవర్లు వేసిన బుమ్రా కేవలం 8 పరుగులే ఇవ్వగా.. 6 ఓవర్లు వేసిన సిరాజ్ 22 రన్స్ ఇచ్చాడు. మరోవైపు అశ్విన్‌తో బౌలింగ్ చేయిస్తున్న రోహిత్ శర్మ.. రవీంద్ర జడేజాతో మాత్రం ఇప్పటి వరకు బౌలింగ్ చేయించలేదు.

వాస్తవానికి బంగ్లాదేశ్ టీమ్‌లో ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నది శాంటో మాత్రమే. చెపాక్ టెస్టులో టీమ్‌లోని బ్యాటర్లు విఫలమైన వేళ శాంటో హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. ఈరోజు కాన్పూర్ టెస్టులో శాంటో ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లోనే ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయిపోయినట్లు కనిపించాడు. కానీ.. అంపైర్ ఔట్ ఇవ్వలేదు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ డీఆర్‌ఎస్‌కి వెళ్లినా నిరాశ తప్పలేదు. వికెట్ చేజారుతుందనే భయం లేకుండా శాంటో క్రీజు వెలుపలికి వచ్చి మరీ షాట్స్ ఆడుతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here