కఠోర తపస్సు వల్ల అమ్మవారి శరీరం పూర్తిగా కృశించిపోయింది. దేవతలు, రుషులు, సిద్ధగణాలు అందరూ బ్రహ్మచారిణి తపస్సును అపూర్వమైన పుణ్యకార్యమని కొనియాడారు. ఆమె భక్తికి మెచ్చి ‘ఓ దేవీ, ఇప్పటి వరకు ఎవరూ ఇంత కఠోర తపస్సు చేయలేదు. ఇది నీతోనే సాధ్యమైంది. మీ కోరిక నెరవేరుతుంది. మీరు చంద్రమౌళి అయిన శివుడిని మీ భర్తగా పొందుతారు’ అని ఆశీర్వదించారు. అలా కఠినమైన తపస్సు చేసినందుకు గాను అమ్మవారిని బ్రహ్మచారిణి అని పిలిచారు. బ్రహ్మచారిణి అమ్మవారిని పూజించడం వల్ల జ్ఞానం, ఆధ్యాత్మిక వృద్ధి లభిస్తుందని నమ్ముతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here