విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్(prakash raj)తిరుపతి లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్(pawan kalyan)కి చేస్తున్న ట్వీట్ ల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది.పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉన్నా కూడా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రకాష్ రాజ్ ట్వీట్ ల మీద ట్వీట్ లు చేస్తూనే ఉన్నాడు. 

ప్రకాష్ రాజ్ తాజాగా మరో ట్వీట్ చేసాడు. మనకేం కావాలి అనే టాగ్ లైన్ ని టైటిల్ గా ఉంచి ప్రజల్లో భావోద్వేగాల్ని రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించడమా లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలనా సంబంధమయినా, అవసరమైతే  తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవడమా జస్ట్ అస్కింగ్ అంటూ ట్వీట్ చేసాడు. ఇప్పుడు ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక ఎన్టీఆర్(ntr)ఫ్యాన్స్ లో అయితే ప్రకాష్ రాజ్ ట్వీట్లతో భయం పట్టుకుంది.ఇప్పటికే హిందూ సంఘాలు ప్రకాష్ రాజ్ మీద కోపంగా ఉన్నాయి.కొంత మంది అయితే ఏకంగా సినిమా ఆర్టిసులకి సంబంధించిన మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దగ్గరకి వెళ్లి ప్రకాష్ రాజ్ ని సినిమాల నుంచి బ్యాన్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో భయం పట్టుకుంది. దేవర లో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.


  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here