స్వచ్ఛంధంగా వదులుకున్నారు…
నగరంలోని వివిధ దశల్లో చేపట్టిన వరద నష్టం గణనలో పలు కుటుంబాలు తమకు పరిహారం అవసరం లేదని పేర్కొన్నాయి. ఇలాంటి కుటుంబాలు దాదాపు 80వేల వరకు ఉండొచ్చని సిఎంఓ కార్యాలయ వర్గాలు తెలిపాయి. వరదల్లో ప్రధానంగా ఒక అంతస్తులోపు మాత్రమే నివాసాలు ఉన్న వారికి ఎక్కువ నష్టం వాటిల్లింది. రెండో అంతస్తు ఉన్న వారికి వరద ముంపుకు గురి కాలేదు. మొదటి అంతస్తులోపు ఉన్న వారికి రూ.25వేలు, మొదటి అంతస్తు ఆపై ఉన్న వారికి రూ.10వేల పరిహారం ప్రభుత్వం ప్రకటించింది. ద్విచక్ర వాహనానికి రూ.3వేలు, ఆటోకు రూ.10వేలు చెల్లించారు. దుకాణాలు, పశువులు, కోళ్లు ఇలా అన్నింటికి లెక్క కట్టి పరిహారం చెల్లించారు. వరద నష్టం గణనలో పలు కుటుంబాలు తమకు ఎలాంటి నష్టం జరగలేదని, పరిహారం అవసరం లేదని పేర్కొనడాన్ని అధికారులు గుర్తించారు. ఇలాంటి కుటుంబాలు 80వేల వరకు ఉండొచ్చని, వరద నష్టం చెల్లింపు పూర్తైన తర్వాత పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.